అల్లు అర్జున్ ఫై కౌంటర్ వేసిన సాయి ధరమ్ తేజ్!
- February 27, 2017 / 07:04 AM ISTByFilmy Focus
అసలు మెగా ఫ్యామిలీకి ఏమయింది….మెగా హీరోల మధ్య ఏం జరుగుతుంది….ఏమో మొత్తంగా చూసుకుంటే….మెగా హీరోల మధ్య వైరం కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఏర్పడేందుకు దారి తీసెలా కనిపిస్తుంది…విషయంలోకి వెళితే…ఇప్పటికీ….స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ విపరీతమైన కౌంటర్లు వేస్తుంటే దానికి సహకరిస్తూ మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ కూడా బన్నిని టార్గెట్ చేశాడు అన్న టాక్ బలంగా వినిపిస్తుంది…. ఇంతకీ తేజ్ బన్ని గురించి ఏమన్నాడని ఈ హడావిడి అంతా అంటే..ఒకసారి ఈ మ్యాటర్ చదవండి మీకే అర్ధం అవుతుంది…..తేజ నటించిన విన్నర్ సినిమాలో తనకు నచ్చని సినిమా ఒకటి రేసుగుర్రం, మరోటి నాన్నకు ప్రేమతో అన్నాడు తేజ్. అంతేనా ఓ సందర్భంలో ‘అది రేసుగుర్రం అయితే మా వాడు దాన్ని స్వారీ చేస్తాడు’.. అని డైలాగ్ కొడతాడు… సో దీన్ని బట్టి చూస్తే రేసు గుర్రంతో బన్నికి వార్నింగ్ ఇచ్చినట్టు అంటున్నారు.
మెగా మేనళ్లుడిగా వచ్చిన కొద్దిరోజులకే మెగా ఫ్యాన్స్ అండదండలను అందుకున్న సాయి ధరం తేజ్ మామలకు ఫుల్ సపోర్ట్ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటె విపరీతమైన అభిమానం. ఆ కారణం చేతే బన్ని మీద పంచ్ వేసి ఉంటాడని అంటున్నారు. తేజ్ సినిమాలో రేసుగుర్రం నచ్చదని చెప్పడం అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు కూడా నచ్చలేదు. అందుకే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తేజ్ ను కూడా ఏకిపారేస్తున్నారు. చెప్పను బ్రదర్ అన్న దగ్గర నుండి పవర్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గొడవ గురించి తెలిసిందే. ఇదిలా కొనసాగితే మెగా ఫ్యామిలీ రెండు భాగాలుగా విడిపోయే పరిస్థితి దాపరిస్తుందేమో అని మెగా ఫ్యాన్స్ కాస్త భయంతోనే ఆలోచనలు చేస్తున్నారు…చూడాలి ఈ పరిణామం ఎక్కడవరకూ పోతుందో…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















