Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్ అయ్యేది ఎప్పుడంటే?
- September 21, 2021 / 06:33 PM ISTByFilmy Focus
వినాయక చవితి రోజు రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్ తేజ్ మొత్తానికి కొలుకున్నట్లు వైద్యులు క్లారిటీ ఇచ్చేశారు. మరికొన్ని రోజుల్లో అతన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయబోతున్నట్లు కూడా తెలియజేశారు. గత వారం రోజులుగా అపోలో హాస్పిటల్ లో చికిత్స అందుకుంటున్న సాయి ధరమ్ తేజ్ విజయవంతంగా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కేబుల్ బ్రిడ్జ్-ఐకియూ మార్గంలో బైక్ పై అనుకోకుండా బైక్ స్కిడ్ కావడం వలన సాయి తేజ్ గాయపడిన విషయం తెలిసిందే.
ఆ క్షణంలో సమీప మెడికవర్ ఆసుపత్రికి ప్రాథమిక చికిత్స కోసం తరలించారు. ఇక ఆ తరువాత అపోలో హాస్పిటల్ కు షిప్ట్ చేయడంతో ఒక చిన్న సర్జరీ కూడా చేశారు. వైద్య బృందం సంరక్షణలో సాయి తేజ్ పూర్తిగా కొలుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బిగ్ బాస్ షోలో కూడా రామ్ చరణ్ తేజ్ కూడా సాయి తేజ్ పూర్తిగా కొలుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాలర్ బోన్ ఆపరేషన్ అనంతరం మరికొన్ని రోజులు అతనికి విశ్రాంతి అవరమని వైద్యులు వివరణ ఇచ్చారు.

గతం రెండు మూడు రోజుల కంటే కూడా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత మెరుగైందని చెప్పిన వైద్యులు మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు వివరణ ఇచ్చారు. ఇక సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా ట్రైలర్ ను బుధవారం మెగాస్టార్ విడుదల చేయబోతున్నారు.
నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?















