Sai Pallavi: అనారోగ్యం పాలైన సాయి పల్లవి… ఏమైందంటే?
- January 28, 2025 / 10:22 PM ISTByPhani Kumar
నాగ చైతన్య (Naga Chaitanya) – సాయి పల్లవి (Sai Pallavi) కాంబినేషన్లో వచ్చిన ‘లవ్ స్టోరీ’ (Love Story) సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ ఇదే కాంబినేషన్లో ‘తండేల్’ (Thandel) అనే సినిమా రూపొందింది. హిట్ పెయిర్ కాబట్టి.. దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా ‘తండేల్’ ని ప్రమోట్ చేస్తున్నారు.
Sai Pallavi

ఈరోజు వైజాగ్లో ట్రైలర్ లాంచ్ వేడుకని నిర్వహించారు. కానీ దీనికి హీరోయిన్ సాయి పల్లవి హాజరుకాలేదు. ఇందుకు కారణం ఆమె అస్వస్థతకు గురవ్వడమే అని తెలుస్తుంది. విషయం ఏంటంటే.. సాయి పల్లవి కూడా ‘తండేల్’ ట్రైలర్ లాంచ్ కి రావాలట. కానీ ఆమెకు ఒంట్లో బాలేదట. ట్రైలర్ లాంచ్ కి వచ్చే టైంలో ఆమెకు కళ్ళు తిరిగాయట. అందువల్ల ఆమె డాక్టర్ వద్దకు వెళ్లడం జరిగిందట.

ఈ టైంలో ప్రయాణం చేయడం కరెక్ట్ కాదని భావించి.. ఆమెను రెస్ట్ తీసుకోమని ‘తండేల్’ టీం చెప్పారట. అందుకే ఆమె వైజాగ్లో జరిగిన ట్రైలర్ లాంచ్ కి రాలేదని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. అయితే ‘తండేల్’ సినిమాలో ఆమె చాలా బాగా నటించిందట. అంతేకాదు ‘మన ఫేవరెట్ డార్లింగ్ సాయి పల్లవి అద్భుతంగా యాక్ట్ చేసింది’ అంటూ అల్లు అరవింద్ పలకడం అక్కడ అందరిలో హుషారు నింపినట్టు అయ్యింది.












