Sai SriRam: నాట్యాన్ని కించపరిచేలా సినిమాలొస్తున్నాయి : సాయి శ్రీరామ్
- April 9, 2021 / 07:53 PM ISTByFilmy Focus
ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత సాయి శ్రీరామ్ కమల్ హసన్, అజిత్ పై సంచలన ఆరోపణలు చేశారు. స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న కమల్, అజిత్ భరతనాట్యానికి ద్రోహం చేశారని సాయి శ్రీరామ్ అన్నారు. గడిచిన 30 సంవత్సరాలుగా కళామతల్లికి సేవలందిస్తున్న సాయి శ్రీరామ్ కుమార సంభవం పేరుతో భరతనాట్యం ఇతివృత్తంతో ఒక సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో సాయిశ్రీరామ్ నటించడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, నిర్మాణ బాధ్యతలు, నృత్యం, దర్శకత్వం చేపట్టారు.
ఈ సినిమాలో హీరోయిన్లుగా సాయి అక్షిత, మీనాక్షి, నిఖితా మీనన్ నటించారు. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానుండగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు. తను మాత్రమే కాదని తన తండ్రి కూడా భరత నాట్య కళాకారుడని సాయి శ్రీరామ్ పేర్కొన్నారు. కొన్ని సినిమాలకు తాను కొరియోగ్రాఫర్ గా వ్యవహరించానని సాయి శ్రీరామ్ వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న సినిమాలు భరతనాట్యాన్ని కించపరిచే విధంగా ఉందని సాయి శ్రీరామ్ పేర్కొన్నారు.

వరలాలు చిత్రంలో అజిత్ భరతనాట్యం నేర్చుకునే సన్నివేశాలతో పాటు ఒక సినిమాలో కమల్ హాసన్ భరతనాట్యం నేర్చుకోవడంతో ఆయనను భార్య వదిలి వెళ్లినట్టు షూట్ చేశారని అలాంటి సన్నివేశాల వల్ల భరతనాట్యం నేర్చుకున్న వారిని పెళ్లి చేసుకోవడానికి యువతులు ముందుకు రావడం లేదని సాయి శ్రీరామ్ తెలిపారు. భరత నాట్య కళాకారులపై సమాజంలో అపోహలు నెలకొన్నాయని ఆయన అన్నారు. సమాజంలో అపోహలను తొలగించాలనే ఉద్దేశంతోనే తాను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని సాయి శ్రీరామ్ వెల్లడించారు..
Most Recommended Video
వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!














