Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?
- April 29, 2026 / 02:41 PM ISTByPhani Kumar
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది'(Peddi). విలేజ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్పై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి.
Peddi
రీసెంట్గా రిలీజైన గ్లింప్స్లో చరణ్ రఫ్ అండ్ మాస్ ‘పహిల్వాన్’ గెటప్ ఫ్యాన్స్కు గూస్బంప్స్ తెప్పించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో ఓ క్రేజీ స్పెషల్ సాంగ్/ ఐటెమ్ సాంగ్ ఉండబోతోందట. ముందుగా ఈ పాట కోసం ‘సీతా రామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ను అనుకున్నారని, కానీ ఆమె తప్పుకోవడంతో ఆ ఆఫర్ ఇప్పుడు శృతి హాసన్ దగ్గరకు వెళ్లిందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఏప్రిల్ 26న హైదరాబాద్లోనే ఈ స్పెషల్ డ్యాన్స్ నంబర్ షూటింగ్ స్టార్ట్ అయిందని సమాచారం. అయితే ఈ ఒక్క పాట కోసం శృతి హాసన్ ఏకంగా రూ.2.5 కోట్ల నుంచి 3.5 కోట్ల మధ్య భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.వాస్తవానికి ఈ మూవీని మార్చి 27న రిలీజ్ చేయాలనుకుని, తర్వాత ఏప్రిల్ 30కి మార్చారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ జూన్ నెలకు ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. శివరాజ్ కుమార్, జగపతి బాబు లాంటి భారీ స్టార్ కాస్ట్ కీ రోల్స్ చేస్తున్నారు.
ఇక ఈ మూవీ షూటింగ్ ఇంకో వారం రోజుల్లో కంప్లీట్ కానుంది.’పెద్ది’ ప్రాజెక్ట్ పూర్తవ్వగానే.. చరణ్ వెంటనే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘RC17’ సెట్స్పైకి వెళ్లనున్నారు. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో సినిమా వస్తుండటంతో అంచనాలు వేరే రేంజ్లో ఉన్నాయి.
















