సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో, నిర్మాత తేనెటీగా రామారావు, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ గా పేరొందిన విక్రమ్ గైక్వాడ్, కమెడియన్ రాకేష్ పుజారి, మాస్టర్ భరత్ తల్లి కమలహాసిని, ‘అదుర్స్’ విలన్ ముకుల్ దేవ్,తమిళ నటుడు రాజేష్,హాలీవుడ్ నటి లొరెట్టా స్విట్, తమిళ నటుడు విక్రమ్ సుకుమారన్ వంటి చాలా మంది సెలబ్రిటీలు మరణించారు.
ఈ షాక్ ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇంకో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఓ బాలీవుడ్ నటుడు తాజాగా కన్నుమూసినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. హిందీ బుల్లితెర నటుడు అయినటువంటి విభు రాఘవే (Vibhu Raghave) అలియాస్ వైభవ్ కుమార్ సింగ్ మృతి చెందారు. అతని వయసు 37 ఏళ్ళు మాత్రమే. గత 2,3 ఏళ్ళుగా ఇతను పెద్ద పేగు క్యాన్సర్ తో బాధపడుతున్నాడట. ఇటీవల అది స్టేజ్ 4 కి వెళ్ళడంతో పరిస్థితి విషమించిందట.
ఈ క్రమంలో ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూనే కన్నుమూసినట్టు తెలుస్తుంది. ‘నిషా ఔర్ ఉస్కె కజిన్స్’ అనే సీరియల్ ద్వారా ఇతను (Vibhu Raghave) మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ‘సావధాన్ ఇండియా’ వంటి షోలలో కూడా పాల్గొని ఇతను క్రేజ్ పెంచుకున్నాడు. అలాగే సినిమాల్లోకి ఎంట్రీ.. ‘పిచ్ ఫోర్క్’ ‘యాద్వి – ది డిగ్నిఫైడ్ ప్రిన్సెస్’ వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు.