మెగా ఫ్యామిలీని పూర్తిగా ఉపయోగించుకుంటున్న సుకుమార్
August 2, 2017 / 12:24 PM IST
|Follow Us
సుకుమార్ లో ఒక దర్శకుడు మాత్రమే కాదు.. నిర్మాత కూడా దాగున్నాడు. ఆ విషయాన్నీ “కుమారి 21 ఎఫ్” సినిమా ద్వారా నిరూపించుకున్నారు. మరోసారి తన నిర్మాణపు ప్రతిభను ప్రదర్శించనున్నారు. “దర్శకుడు” సినిమాని చక్కగా నిర్మించడమే కాదు.. ప్రమోషన్ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఈ ప్రచారంలో స్టార్ హీరోలందరినీ భాగస్వాములను చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో టీజర్ లాంచ్ చేయించిన సుకుమార్ .. ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ లను దర్శకుడు వేడుకలకు రప్పించారు. వీరి ముగ్గురితో సుకుమార్ సినిమాలు చేశారు, చేస్తున్నారు. సో పిలవగానే వచ్చారు. తాజాగా ఈ ప్రమోషన్లోకి మెగాస్టార్ చిరంజీవిని కూడా రప్పించారు.
కొత్త స్టార్ అశోక్ హీరోగా పరిచయం అవుతున్న ఈ మూవీ శుక్రవారం (ఆగస్టు 4) రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా తొలి టికెట్ ను తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కొనుగోలు చేశారు. ఇలా సుకుమార్ మెగా ఫ్యామిలీని పూర్తిగా ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తేజ్ తో రంగస్థలం 1985 సినిమాని తెరకెక్కిస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ లో థియేటర్లోకి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.