హీరోయిన్ల మీద కేరింగ్ చూపించే వాళ్లే సినిమా పరిశ్రమలో ఉండరు అని అంటుంటారు కొంతమంది కథానాయికలు. అందరూ బయటకు అనకపోయినా.. కొంతమంది నాయికలు ఈ పని చేశారు. తాజాగా హీరోయిన్ విషయంలో ఓ హీరో కేరింగ్ తీసుకున్న ఘటన శాండిల్ వుడ్లో జరిగింది. హీరోయిన్ కంఫర్ట్ కోసం ఏకంగా సినిమా షూటింగ్ని ముంబయికి షిఫ్ట్ చేశారు. సినిమా నిర్మాతకు అదనపు ఖర్చు అని తెలిసినా.. ఆమె కంఫర్ట్ ముఖ్యం అని తేల్చి చెప్పారట హీరో.
ఈ క్యూట్ గెస్చర్ చేసిన హీరో యశ్ (Yash) కాగా.. ఆ సినిమా ‘టాక్సిక్’ (Toxic). ఇక ఎవరి కోసం యశ్ (Yash) ఇదంతా చేశారో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కియారా అడ్వాణీ (Kiara Advani) కోసమే ఇదంతా చేశారు. ‘కేజీయఫ్’ (K.G.F) సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు యశ్ (Yash). ఆయన చాలా గ్యాప్ తర్వాత ‘టాక్సిక్’ (Toxic) అనే సినిమా చేస్తున్నాడు. అందులో హీరోయిన్గా నటిస్తున్న కియారా అడ్వాణీ (Kiara Advani) ప్రస్తుతం ప్రెగ్నెంట్. దీంతో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుందట.
‘టాక్సిక్’ (Toxic) సినిమా షూటింగ్ను గత కొన్ని రోజులుగా బెంగళూరులో చేస్తుండగా.. ఇప్పుడు ముంబయికి మార్చారట. ప్రతిసారి సినిమా కోసం కియారా (Kiara Advani).. ముంబయి నుండి బెంగళూరుకి వెళ్లి రావడం ఇబ్బందిగా మారిందట. దీంతో సినిమా చిత్రీకరణను ముంబయికి మార్చారట. ప్రయాణాల కారణంగా కియారా (Kiara Advani) కు అసౌకర్యం కలగకూడదని యశ్(Yash) సూచించడంతో దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని శాండిల్ వుడ్ వర్గాల సమాచారం.
అంతేకాదు ఈ మార్పు వల్ల బడ్జెట్ పెరగకుండా యశ్ (Yash) కొన్ని సూచనలు కూడా చేసినట్లు భోగట్టా.ఇక ఈ సినిమా గురించి చూస్తే.. 90ల్లో గోవాలోని ఓ డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగుతుందీ చిత్రం. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా కూడా నటిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది మార్చి 19న సినిమాను విడుదల చేయడానికి చిత్రబృందం ప్రయత్నిస్తోంది.