షీలాని ఇప్పుడు చూస్తే షాక్ అవుతారు!
- December 17, 2016 / 06:40 AM ISTByFilmy Focus
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదుర్స్ మూవీలో నటించిన షీలా గతకొంతకాలంగా తెలుగు చిత్రాలకు దూరంగా ఉంది. సీతాకోక చిలుకతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పరుగు చిత్రంలో అమాయకంగా నటించి తెలుగు ప్రజలకు దగ్గరైంది. రామ్ తో కలిసి మస్కా చేసి హిట్ కొట్టింది. షీలా చివరిగా కనిపించిన మూవీ పరమవీర చక్ర. ఐదేళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ ఫెయిల్ కావడంతో అనంతరం ఏ ప్రాజక్ట్ కి సంతకం చేయలేదు. మీడియాకు కూడా కనిపించలేదు.
రీసెంట్ గా ఆమె తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చారు. శ్రీ వేంకటేశ్వరుని దర్శంచుకొని తిరిగి వస్తుండగా కెమెరాకు చిక్కారు. అయితే బొద్దుగా ఉండే షీలా సైజ్ జీరో లో కనిపించేసరికి అందరూ షాక్ తిన్నారు. వెంటనే “మీకు ఏమైంది ఎలా అయిపోయారు” అని అడగగా ఆమె నవ్వుతూ తెలుగులో సమాధానం చెప్పారు. తనకు ఏమి కాలేదని జవాబిచ్చారు. ఓ తమిళ మూవీ కోసం బరువు తగ్గాల్సి వచ్చిందని వివరించారు. మరి తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తారు ? అని ప్రశ్నించగా .. వచ్చే ఏడాది తెలుగు మూవీలో నటిస్తానని షీలా వెల్లడించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














