Ram Charan: స్టార్ హీరో రామ్ చరణ్ కు అరుదైన గౌరవం.. ఏం జరిగిందంటే?
- May 23, 2023 / 02:14 AM ISTByFilmy Focus
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాతో, బుచ్చిబాబు డైరెక్షన్ లో మరో సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ రెండు సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రామ్ చరణ్ హాజరు కాగా ఈ వేడుకలలో చరణ్ చేసిన కామెంట్లపై ప్రశంసలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. జీ20 సమ్మిట్ కోసం రామ్ చరణ్ కశ్మీర్ కు వెళ్లారు. శ్రీనగర్ కు వెళ్లిన రామ్ చరణ్ జమ్మూ కశ్మీర్ లో సినిమా షూటింగ్ లు చేయాలని ప్రమోట్ చేయనున్నారని సమాచారం అందుతోంది. చరణ్ కు అరుదైన అవకాశం దక్కడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

మరోవైపు గేమ్ ఛేంజర్ సినిమా ఏకంగా 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. రామ్ చరణ్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. చరణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చరణ్ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

రామ్ చరణ్ (Ram Charan) పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా చరణ్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రామ్ చరణ్ నటుడిగా తన స్థాయిని పెంచుకోవడంతో పాటు అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. చరణ్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.
బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!
అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

















