Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?
- April 23, 2026 / 04:05 PM ISTByFilmy Focus Desk
టాలీవుడ్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కు ప్రత్యేక గుర్తింపు ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి ఆయన దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో వేగంగా కొనసాగుతుండగా, దసరా సీజన్ను టార్గెట్గా పెట్టుకుని విడుదలకు సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Adarsha Kutumbam
ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలక మార్పు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. మొదట ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపికైన హర్షవర్ధన్ రామేశ్వర్ ఆల్రెడీ సినిమాకు సంబందించిన వర్క్ మొదలుపెట్టిన ఆయన అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కారణాలపై అధికారిక సమాచారం లేకపోయినా, షెడ్యూల్ ఇష్యూస్ లేదా ఇతర ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని అంచనా వేస్తున్నారు.

హర్షవర్ధన్ వైదొలగడంతో, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లోకి ఎస్ ఎస్ థమన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. త్రివిక్రమ్- తమన్ కాంబినేషన్ అంటేనే మ్యూజికల్ హిట్ గ్యారంటీ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన అల వైకుంఠపురంలో, అ ఆ, గుంటూరు కారం వంటి చిత్రాలు మ్యూజిక్ పరంగా మంచి స్పందన అందుకున్నాయి.
ఈ నేపథ్యంలో “ఆదర్శ కుటుంబం”కు తమన్ సంగీతం అందిస్తే, సినిమాకు మరింత బలం చేకూరుతుందని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి, మ్యూజిక్ డైరెక్టర్ మార్పు ఈ ప్రాజెక్ట్పై ఆసక్తిని మరింత పెంచింది. అధికారిక ప్రకటన కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.















