అమల ప్లాన్ కి అవాక్కయిన మీడియా ప్రతినిధులు
- February 28, 2017 / 09:10 AM ISTByFilmy Focus
అక్కినేని నాగార్జున మీడియాకి చాలా దగ్గరగా ఉంటారు. తన చిత్రాలు, వ్యక్తిగత విషయాలపై క్లారిటీ ఇవ్వడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. అయితే అఖిల్, శ్రీయాల మధ్య గొడవలు అంటూ వార్తలు బయటికి వచ్చినప్పటి నుంచి నాగ్ ఎవరి కాల్స్ కి స్పందించడం లేదు. సోషల్ మీడియాలోను పోస్టులు చేయడం లేదు. తన కొడుకు పెళ్లిపై ఎటువంటి ప్రకటన చేయడం లేదు. అఖిల్, నాగ చైతన్యలు కూడా మీడియాకు ముఖం చాటేశారు. అయితే సోమవారం అమల హైదరాబాద్ లో జరిగిన రెండు ప్రవేట్ ఫంక్షన్స్ కు అక్కినేని కుటుంబం తరఫున హాజరయ్యారు.
ఆ ఫంక్షన్స్ లో అమలను చూసిన రిపోర్టర్లు కార్యక్రమం అయిన తర్వాత కొడుకు పెళ్లిపై ప్రశ్నలు గుప్పించాలని అనుకున్నారు. ఫొటోగ్రాఫర్లు సైతం ఫోటోలు తీయడానికి ప్రయత్నించారు. కానీ మీడియా ప్రతినిధులకు కనిపించకుండా ఫంక్షన్ నుంచి వెళ్ళిపోయి అమల షాకిచ్చారు. అఖిల్ పెళ్లి చిక్కుడు వీడుతుందని ఆశించిన వారు అవాక్కయ్యారు. అమల సీక్రెట్ గా వెళ్లిపోవడంతో అఖిల్ పెళ్లి విషయంలో ఏదో మతలబు జరిగిన మాట వాస్తవమని చెప్పుకుంటున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















