మంచికి పోతే చెడు ఎదురైందని, గొప్పగా చెప్పబోతే తిప్పలు ఎదురైనట్లు.. ఈ రెండు జాతీయాలకు అర్థం కావాలా? ఇప్పుడు వీటికి పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలిచిన ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ను అడిగితే మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన ఓ సినిమా స్టేజీ మీద చేసిన కొన్ని వ్యాఖ్యలకు ఇప్పుడు ఆయన మీద కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చింది. ‘రెట్రో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్గా వచ్చిన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాల్ని దెబ్బ తీశాయని గిరిజన సంఘాలు కేసు పెట్టాయి.
సూర్య (Suriya) ‘రెట్రో’ సినిమాను తెలుగులో విడుదల చేసిన నాగవంశీ (Naga Vamsi) తోఉన్న పరిచయం (ప్రస్తుతం సినిమా చేస్తున్నందుగాను కూడా కావొచ్చు)తో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఆ సినిమా తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్కి వచ్చాడు. అప్పుడే పెహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. దాని గురించి ప్రస్తావించి ప్రేక్షకులు దేశ భక్తి పెంపొదిద్దాం అనే ఆలోచనతో విజయ్ దేవరకొండ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల గురించి మాట్లాడుతూ ట్రైబల్స్ అనే పదం వాడాడు.
దీంతో గిరిజనుల్ని ఉగ్రవాదులతో పోలుస్తారా అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెంటనే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) స్పందించాడు. తను ట్రైబ్స్ అనే పదం వాడిన మాట నిజమేకానీ, సందర్భం వేరు అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ నోట్ రిలీజ్ చేశాడు. వందల ఏళ్ల కిందట గుంపుల్ని ఉద్దేశిస్తూ తను ఆ పదం వాడానని చెప్పే ప్రయత్నం చేశాడు. అక్కడితో ఆ వివాదం ముగిసిందని అనుకున్నారు. కానీ ఆ వ్యాఖ్యల కారణంగా ఇప్పుడు విజయ్ దేవరకొండపై కేసు నమోదైంది.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చేసిన వ్యాఖ్యలపై రాయదుర్గం పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. దీంతో విజయ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనికి విజయ్ టీమ్ అయితే పాత సోషల్ మీడియా పోస్టునే సమాధానంగా చెబుతోంది. అయితే వేదికలపై మాటల విషయంలో హీరోలు కచ్చితంగా సంయమనం పాటించాలి అని ఈ ఉదంతం నేర్పుతోంది. మరి మన హీరోలు జాగ్రత్త పడతారో లేదో చూడాలి.