విమర్శలే నాకు బలాన్నిచ్చాయి : సమంత
- September 4, 2017 / 12:53 PM ISTByFilmy Focus
ప్రతి భావాన్ని చాలా సున్నితంగా పలకగల నటి సమంత. అందుకే తెలుగు, తమిళ పరిశ్రమకు చెందిన వారు క్యూట్ బ్యూటీగా పిలుచుకుంటుంటారు. ఏ మాయ చేసావే, ఏటో వెళ్లిపోయింది మనసు చిత్రాలకు నంది అవార్డులు అందుకున్న ఈ బ్యూటీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తల్లో ఎదుర్కొన్న కొన్ని సంగతులను వెల్లడించింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో సమంత మాట్లాడుతూ ” నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ‘నువ్వు నటిగా పనికి రావు. సినిమాల్లో ఎక్కువకాలం నిలదొక్కుకోలేవు’ అని అన్నారు. కొత్తలోనే కాదు ఇప్పటికీ ఏదో ఒకచోట నాపై విమర్శలు వింటూనే ఉంటా. అవన్నీ నాకు కొండంత బలాన్నిస్తాయి.” అని వివరించారు.
అంతేకాదు విమర్శకులు మనకి నిజమైన శ్రేయోభిలాషులని చెప్పారు. “విమర్శలే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాయనేది నా నమ్మకం. విమర్శించే వారు మనల్ని ఇబ్బందిపెట్టాలని అలా మాట్లాడరు. వాళ్ళ విమర్శల్లో ఎంతోకొంత నిజం ఉండే ఉంటుంది. దాన్ని మనం పసిగట్టాలి. అవన్నీ తట్టుకొని నేడు ఈ స్థాయిలో ఉన్నాను. అప్పుడో ఇప్పుడో వచ్చే కొన్నివిమర్శలు నేను సంతోషంగా స్వీకరిస్తా” అని సమంత స్పష్టం చేసింది. ప్రస్తుతం సమంత రామ్చరణ్ సరసన ‘రంగ స్థలం 1985’ షూటింగ్లో బిజీగా ఉంది. అలాగే మహాని సావిత్రి బయోపిక్ మూవీలోనూ నటిస్తోంది. మరో మూడు తమిళ చిత్రాల్లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. వీటన్నింటినీ తన పెళ్లి (అక్టోబర్ 6 ) కి కొన్ని రోజుల ముందే కంప్లీట్ చేయాలనీ రాత్రి పగలు కష్టపడుతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















