ప్రభాస్ స్ఫూర్తితో అలా చేయనని చెప్పిన ధనుష్!
- July 27, 2017 / 03:27 PM ISTByFilmy Focus
తమిళ యువ హీరో ధనుష్ కి తెలుగులోనూ ఎక్కువగా అభిమానులున్నారు. ఆయన నటించిన రఘువరన్ బీటెక్ చిత్రం ఇక్కడ సూపర్ హిట్ సాధించింది. దానికి సీక్వెల్ గా వీఐపీ 2 అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ధనుష్ కథ, మాటలు అందిస్తోన్న ఈ చిత్రానికి రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. వండర్ బార్ ఫిల్మ్స్ బ్యానర్పై ధనుష్ సొంత నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రం రేపు (జులై 28 ) రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ధనుష్ చిత్ర విశేషాలతోపాటు మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ అనేకమందికి ఇన్స్పిరేషన్ గా మారారు? అదే స్పూర్తితో మీరుకూడా భవిష్యత్తులో కండలు పెంచుతారా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు …. “అసలు చేయను.
ఇలా(సన్నగా) ఉండడమే నా బలం. రోడ్డు మీదకు వెళితే నాలాంటి వారు వందమంది కనిపిస్తారు. వారందరూ నన్ను చూసి కనెక్ట్ అవుతారు.” అంటూ నిజాయితీగా సమాధానమిచ్చారు. సౌందర్య దర్శకత్వం వహించిన మొదటి సినిమా కొచ్చాడియాన్ విజయం సాధించలేదు. దీనిపైనే ఆమె ఆశలు పెట్టుకున్నారు. ఫలితం రేపు తేలనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















