‘జిగర్తాండ’ రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్
- December 16, 2018 / 02:46 AM ISTByFilmy Focus
పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం ‘జిగర్తాండా’ అనే తమిళ్ రీమేక్ చేయబోతున్నట్టు రోజుకో వార్త షికారు చేసింది. మొదట ఈ చిత్రంలో విలన్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించబోతున్నాడని.. రష్మిక ను హీరోయిన్ గా ఎంచుకున్నారని,ఇక రెండవ హీరో పాత్రలో హరీష్ నాగశౌర్య .. రాజ్ తరుణ్ లను సంప్రదించారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల పై తాజాగా హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు.
‘జిగర్తాండా’ రీమేక్ పై ఇప్పటి వరకు వచ్చిన వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పాడు హరీష్. అసలు నాగశౌర్య .. రాజ్ తరుణ్ లను సంప్రదించలేదని… వరుణ్ తేజ్ ను కూడా విలన్ పాత్ర కోసం ఒప్పించే ప్రయత్నాలేమీ జరగలేదు. ఇవన్నీ వట్టి పుకార్లేనని హరీష్ చెప్పుకొచ్చాడు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















