నారా రోహిత్ (Nara Rohith) దాదాపు 5 ఏళ్ళు గ్యాప్ తీసుకుని ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2) చేశాడు. కానీ ఎన్నికల టైమ్లో రావడం వల్ల ఆ సినిమాని సరిగ్గా అతను ప్రమోట్ చేసుకోలేదు. రోహిత్ కెరీర్ లో ప్రతినిధి (Prathinidhi) ఒక స్పెషల్ మూవీ. మరి దానికి సీక్వెల్ కోటింగ్ తో వచ్చిన ప్రతినిధి 2 ని కరెక్ట్ గా ప్రమోట్ చేసి ఉంటే కచ్చితంగా అతనికి మంచి రీ ఎంట్రీ లభించి ఉండేది. పోనీ అది తీసేసినా..
భైరవం (Bhairavam) రూపంలో నారా రోహిత్ కి మంచి అవకాశం దక్కింది. ఈ సినిమాలో బెటర్ పెర్ఫార్మెన్స్ అంటే … నారా రోహిత్ అని చెప్పిన జనాలు కూడా ఉన్నారు. కానీ దానిని నారా రోహిత్ హైలెట్ చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. మనోజ్(Manchu Manoj) , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas).. లు ఈ సినిమా రిలీజ్ కు ముందు పర్సనల్ గా కూడా ప్రమోట్ చేయించుకున్నారు. మనోజ్ తన పుట్టిన రోజున మీడియాకి విందు పెట్టి.. ఇంటరాక్ట్ అయ్యాడు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టీంని పెట్టుకుని ప్రమోట్ చేసుకోవడం జరిగింది. కానీ రోహిత్ మాత్రం వీటిలో ఏదీ చేయలేదు. మొదటి నుండీ రోహిత్ తో వచ్చిన ఇబ్బంది ఇదే. మంచి నటుడు, పైగా మంచి వాయిస్ కూడా ఉంది. అయినా సరే లేజీగా నటిస్తాడు.. యాక్టివ్ గా మీడియా, సోషల్ మీడియాలో ఉండడు. రోహిత్ కి టిడిపి టీం సపోర్టు కూడా ఉంది. కానీ అతను సరిగ్గా వాడుకోడు. ఇవి అతను ఎప్పుడు గ్రహించి మేలుకుంటాడో చూడాలి.