కళ్యాణ్ రామ్ ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?

Ad not loaded.

గతేడాది ‘ఎంత మంచివాడవురా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయారు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని హిట్ సినిమాతో రావాలనుకుంటున్నాడు. ప్రస్తుతం పలు కథలు వింటున్న ఈ హీరో ఓ కథను లాక్ చేసినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ దీన్ని టేకప్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. రవీందర్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ కళ్యాణ్ రామ్ కి బాగా నచ్చిందట.

ఈ కథలో ఇంటరెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. ఇందులో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపిస్తాడట. గతంలో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వంటి నటులు త్రిపాత్రాభినయం పోషించారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా ఈ లిస్ట్ లో జాయిన్ అవ్వాలని చూస్తున్నాడు. మూడు పాత్రల్లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించడమంటే మామూలు విషయం కాదు.

కానీ కళ్యాణ్ రామ్ మాత్రం కథపై నమ్మకంతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడట. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెల నుండే ఈ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ సినిమాతోనైనా కళ్యాణ్ రామ్ ఆశిస్తున్న విజయం అందుకుంటాడేమో చూడాలి!

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus