మంచు విష్ణు ప్రధాన పాత్రలో ‘కన్నప్ప’ (Kannappa) రూపొందిన సంగతి తెలిసిందే. ఇది అతని డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే స్వయంగా మంచు విష్ణు (Manchu Vishnu) ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అలాగే కథకుడిగా కూడా వ్యవహరించాడు. మంచు విష్ణు తండ్రి మోహన్ బాబు (Mohan Babu) తో పాటు అతని కొడుకు, కూతుళ్లు కూడా ఈ సినిమాలో నటించడం జరిగింది. అలాగే మంచు విష్ణు భార్య విరానికా రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు.
ఆ రకంగా ‘కన్నప్ప’ (Kannappa) మంచు విష్ణుకి చాలా స్పెషల్ మూవీ అని చెప్పాలి. ఇక ఈ సినిమా కోసం చాలా మంది రైటర్లు పనిచేశారు. పరుచూరి బ్రదర్స్ నుండి బుర్రా సాయి మాధవ్ వరకు టాలీవుడ్లో ఉన్న స్టార్ రైటర్స్ ఈ సినిమా కోసం పని చేయడం జరిగింది. ఇక మంచు విష్ణు ఈ చిత్రాన్ని దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. మంచు విష్ణు, మోహన్ బాబు (Mohan Babu) తో పాటు ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించారు.
ముఖ్యంగా ప్రభాస్ (Prabhas) ఈ సినిమాలో మెయిన్ రోల్ పోషించడంతో అందరిలోనూ ‘కన్నప్ప’ (Kannappa) పై ఆసక్తి పెరిగింది. ఇక జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2 రోజుల క్రితం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది ఈ సినిమా. ఇక ఇండస్ట్రీలో కొంతమంది సినీ పెద్దలు ఈ సినిమాను వీక్షించడం జరిగింది. మొన్నటికి మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో రైటర్, దర్శకుడు అయిన బి.వి.ఎస్.రవి ఈ చిత్రాన్ని వీక్షించినట్టు తెలిపారు.
ఫస్ట్ హాఫ్ లో వరల్డ్ డెవలప్మెంట్ ను దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) చాలా బాగా బిల్డ్ చేశారని.. సెకండాఫ్ లో 15 నిమిషాల తర్వాత ప్రభాస్ (Prabhas) ఎంట్రీ ఉంటుందని.. అక్కడి నుండి గూజ్ బంప్స్ మూమెంట్స్ ఎన్నో పలకరిస్తాయని, మంచు విష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని.. రవి చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. రవిలానే ఇండస్ట్రీ ‘కన్నప్ప’ (Kannappa) ని చూసిన వాళ్ళు చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి.