బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘కిష్కింధపురి’. ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్ళపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు.సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి 2 రోజుల ముందు నుండే ప్రీమియర్స్ కూడా వేశారు.
వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి. మొదటి రోజులానే 2వ రోజు కూడా కలెక్ట్ చేసింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 1.65 cr |
సీడెడ్ | 0.36 cr |
ఆంధ్ర(టోటల్) | 1.70 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 3.71 cr (షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.22 cr |
ఓవర్సీస్ | 0.25cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 4.18 cr (షేర్) |
‘కిష్కింధపురి’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.10.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాలి. 2 రోజుల్లో ఈ సినిమాకి రూ.4.18 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.6.82 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ రావడం వల్ల ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. కానీ ‘మిరాయ్’ కి కూడా సూపర్ హిట్ టాక్ రావడం వల్ల ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్ పై కొంత ప్రభావం అయితే పడింది అనే చెప్పాలి. అయినప్పటికీ బెటర్ గానే కలెక్ట్ చేస్తుంది. చూడాలి ఆదివారం కలెక్షన్స్ ఎలా ఉంటాయో