మెగా మల్టీ స్టారర్ మూవీపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే !
- February 13, 2017 / 02:01 PM ISTByFilmy Focus
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఓ మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారని, ఆ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తారని కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమన్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త, ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ తో కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తారని ప్రచారం సాగింది. అయితే ఇందులో వాస్తవం లేదని నేడు తేలిపోయింది. నాలుగు రోజుల క్రితం అమెరికా వెళ్లిన పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు నిర్వహించిన ‘ఇండియా కాన్ఫరెన్స్ 2017’లో ప్రసంగించారు. తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలతో పాటు రాజకీయ అభిప్రాయాలను సైతం ఆయన విద్యార్థులతో పంచుకున్నారు.
అనంతరం విద్యార్థులడిగిన అనేక ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. మెగాస్టార్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారా? అని ఓ స్టూడెంట్ అడగగా ఆయన షాక్ అయ్యారు. అన్నయ్యతో కలిసి నటించడం లేదని స్పష్టం చేశారు. కనీసం అటువంటి ప్రపోజల్ తో తన వద్దకు ఎవరూ రాలేదని వెల్లడించారు. ” అన్నయ్యకు, నాకు కలిసి నటించడం ఇష్టమే. అయితే అందుకు అనేక ఇబ్బందులు ఉంటాయి” అని పవన్ తెలిపారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















