ప్రభాస్ నో చెప్పిన భామకు అల్లు అర్జున్ ఎస్ అన్నాడు
- June 16, 2017 / 06:51 AM ISTByFilmy Focus
కిరాక్ పార్టీ అనే చిత్రంతో యువకుల హృదయాలను కొల్లగొట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మందనా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టేందుకు కొన్ని నెలలుగా ఎదురుచూస్తోంది. తొలి సినిమానే ప్రభాస్ తో నటించే అవకాశం అందుకుంది. ఫోటో షూట్ కూడా చేసిన డైరక్టర్ సుజీత్ చివరికి వద్దన్నారు. బాలీవుడ్ బ్యూటీని పెట్టుకోవాలని ఉద్దేశంతో రష్మికని తొలిగించారు. ప్రభాస్ తో నటించే ఛాన్స్ మిస్ అయిందని ఆమె విచారించే లోపే మరో మంచి ప్రాజక్ట్ లో స్థానం దక్కించుకుంది. డీజే తర్వాత అల్లు అర్జున్ వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.
శిరీషా శ్రీధర్ లగడపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాకి ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే టైటిల్ ప్రకటించారు. ఇందులో ఫ్రెష్ పేస్ కావాలని వంశీ వెతకగా రష్మిక నచ్చిందంట. ఆమెకు అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఖరారు చేసినట్లు సమాచారం. హీరోయిన్ గా రష్మిక పేరును త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. అల్లు అర్జున్ యంగ్ సోల్జర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు శరత్ కుమార్ విలన్ గా నటిస్తున్నారు. విశాల్ – శేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ వచ్చే నెల రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















