ఫ్లాప్ డైరెక్టర్ కొత్త సినిమా..!!
- July 26, 2016 / 10:20 AM ISTByFilmy Focus
మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి మెగా హీరోల చిత్రాలకు కామెడీ ట్రాక్ లు రాసి రచయితగా మంచి పేరు తెచ్చుకొన్న రాజసింహ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన “ఒక్క అమ్మాయి తప్ప” అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం రెండు నెలల క్రితం విడుదలై ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేక చతికిలపడింది. దాంతో డైరెక్టర్ గా రాజసింహ కెరీర్ మొదటి సినిమాతోనే ఆగిపోయిందని చాలా మంది అనుకొన్నారు.
అయితే.. త్వరలోనే రాజసింహ మరో సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని తెలుస్తోంది. అయితే.. ఈసారి కొత్తవారితో ఒక టిపికల్ ట్రెండీ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నాడట. ఈ చిత్రాన్ని రాజసింహ ఎన్నారై స్నేహితులు నిర్మిస్తారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ కు వెళ్లనుందని, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని రాజసింహ తెలిపారు!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















