స్పైడర్ ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్ గా రాబోతున్న రజనీకాంత్
- August 17, 2017 / 11:34 AM ISTByFilmy Focus
కోలీవుడ్ లో తన ఎంట్రీని సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో టాప్ డైరక్టర్స్ లో ఒకరైన మురుగదాస్ తో సినిమాని అంగీకరించి సూపర్ స్టెప్ తీసుకున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న స్పైడర్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఒక పాట మినహా మొత్తం పూర్తి చేసుకుంది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళంలో సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది. ఇప్పటికే థియేటర్స్ ని చేతుల్లోని తీసుకున్న అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ప్రచార కార్యక్రమాల్ని కూడా పెద్ద ఎత్తుల్లో ప్లాన్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 9న చెన్నైలో ఆడియో రిలీజ్ వేడుకను నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీ కాంత్ ని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. మురుగదాస్, మహేష్ పై ఉన్న అభిమానంతో రజనీ ఈ ఫంక్షన్ కి రావడానికి అంగీకరించినట్లు కోలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది. స్పైడర్ గ్లిమ్ప్స్, టీజర్, బూమ్ బూమ్ పాటతో ఇప్పటికే క్రేజ్ సంపాదించుకున్న స్పైడర్ కి రజనీకాంత్ రాక మరింత బూస్ట్ ఇవ్వనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















