వైరల్ అవుతున్న పాయల్ లేటెస్ట్ పిక్..!
- February 18, 2019 / 05:42 PM ISTByFilmy Focus
గతేడాది విడుదలైన ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యింది పాయల్ రాజపుత్. ఈ చిత్రంలో తన నటనతో పాటూ… తన అందంతో కూడా కుర్రకారుని హీటెక్కించింది. ‘లిప్ లాక్స్’ ఓ రేంజ్లో రెచ్చిపోయింది ఈ హర్యానా భామ. ఈ చిత్రంతో.. పాయల్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇప్పుడు రవితేజ సరసన ‘డిస్కో రాజా’ చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టేసింది. దీంతో పాటూ నాగార్జున ‘మన్మధుడు 2’ లో కూడా ఓ హీరోయిన్ నటించబోతుందనే వార్త ప్రచారంలో ఉంది. అంతేకాదు ‘వెంకీమామ’ చిత్రంలో కూడా వెంకటేష్ సరసన జతకట్టబోతుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

- దేవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- లవర్స్ డే రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రివ్యూ..!
- ‘మజిలీ’ టీజర్ రివ్యూ

ఒక పక్క సినిమాలు చేస్తూనే.. మరో పక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ప్రైవేట్ పిక్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ భామ ‘మిస్సా మోర్’ క్లోతింగ్ కు బ్రాండ్ అంబాజిడర్ గా పని చేస్తుంది. ఇందులో భాగంగా ఈ బ్రాండ్ కి సంబందించిన దుస్తులను ధరించి ఫోటో షూట్ చేసింది.. తాజాగా ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేసింది. అందమైన మెరూన్ కలర్ టాప్.. జీన్స్ స్కర్ట్ తో ఈ అమ్మడు ఇచ్చిన ఫోజులు కుర్రకారుని హీటెక్కిస్తున్నాయి. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.














