Sarkaru Vaari Paata: టెన్షన్ లో మహేష్ ఫ్యాన్స్.. కారణమిదే?
July 17, 2021 / 08:08 PM IST
|Follow Us
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ గతేడాది రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో మహేష్ సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ మేకర్స్ కు లీకేజీలు తలనొప్పిగా మారాయి. ఈ మూవీ నుంచి తాజాగా ఒక వీడియో లీకైంది. కొన్ని రోజుల క్రితం సర్కారు వారి పాట షూట్ కు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి.
మేకర్స్ సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ఇప్పటికే సర్కారు వారి పాట షూటింగ్ 40 శాతం పూర్తి కాగా షూటింగ్ మొత్తం పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఈ మూవీ దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుండగా మహేష్, కీర్తి కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.
లీక్డ్ పిక్స్, వీడియోలను ఎంకరేజ్ చేయవద్దని మహేష్ ఫ్యాన్స్ కోరుతున్నారు. లీక్డ్ వీడియో వైరల్ కాకుండా చేయడానికి ఫ్యాన్స్ శ్రమిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో లీకేజీలు మేకర్స్ కు తలనొప్పిగా మారాయి. మహేష్ ఈ మూవీతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. వచ్చే నెల నుంచి త్రివిక్రమ్ మహేష్ కాంబో మూవీ షూటింగ్ మొదలు కానుంది.
Requesting All #SSMB Fans To Do Not Share Any Leaked Video Of Our #SarkaruVaariPaata In Any SM Platforms 🙏