ముంబైలో ఓ మ్యూజికల్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోను నిగమ్ మీద కొందరు ఆకతాయిలు దాడి చేశారు. ఈ ఘటనలో సోను నిగమ్, ఆయన స్నేహితుడు, బాడీ గార్డ్ కి గాయాలయ్యాయి. వెంటనే వారి హాస్పిటల్ కి తరలించారు. అసలేం జరిగిందంటే.. చెంబూరులో జరిగిన మ్యూజికల్ ఈవెంట్ కోసం సోను నిగమ్ తన టీమ్ తో అక్కడికి వెళ్లారు. షో పూర్తయిన తరువాత సోను నిగమ్ స్టేజి మీది నుంచి కిందికి దిగి వస్తుండగా దుండగులు దాడి చేశారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్యక్రమం అనంతం సోను నిగమ్ తో కొందరు సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించారు. సెక్యూరిటీ వారిని వద్దని చెప్పడంతో మెట్లు దిగే సమయంలో దాడి చేశారు. ముందుగా ఓ వ్యక్తి సోను నిగమ్ కాలుని పట్టుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత మంది స్టేజి మీది నుంచి మరికొంత మంది స్టేజి కిందినుంచి వచ్చి సోను నిగమ్ పై దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో సోను మిత్రుడు రబ్బానీ ఖాన్, బాడీ గార్డు కిందపడిపోయారు. వెంటనే నిర్వాహకులు దాడికి యత్నించిన వారిని అడ్డుకున్నారు. ఆ తర్వాత సోనుతో పాటు గాయపడిని వారిని జైన్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన ముంబైలో సంచలనమైంది. దాడికి పాల్పడింది ఎవరు..? కావాలనే దాడి చేశారా..? లేక తోపులాటలో గాయపడ్డారా..? అనే చర్చ జరుగుతోంది.
సెల్ఫీ నిరాకరించడంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ ఫర్తేపేకర్ కొడుకు ఈ దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సోను నిగమ్ బాగానే ఉన్నారు. ప్రమాదకర స్థాయిలో ఆయనకు గాయాలు కాలేదని డాక్టర్స్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. దాడికి పాల్పడిన వ్యక్తులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?