బాలీవుడ్ హీరోయిన్ నీతూ చంద్ర తన కెరీర్ లో ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందికర పరిస్థితుల గురించి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది. 2003లో టాలీవుడ్ లో ‘విష్ణు’ సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తరువాత 2005లో ‘గరం మసాలా’ అనే హిందీ సినిమాలో నటించింది. హిందీతో పాటు తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. అలానే కనడ, తమిళ, బోజ్పురి సహా పలు చిత్రాల్లో నటించింది. శేఖర్ కమ్ముల రూపొందించిన ‘గోదావరి’ సినిమాలో కీలకపాత్ర పోషించింది.
అలానే రాజశేఖర్’ నటించిన ‘సత్యమేవ జయతే’ ఇలా కొన్ని హిట్టు సినిమాల్లో నటించింది. ఈమె సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి దాదాపు ఇరవై ఏళ్లు అవుతుంది. తన సినిమా జర్నీ గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. నాది సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ స్టోరి అంటూ మొదలుపెట్టింది నీతూ. పలు పెద్ద సినిమాల్లో నటించానని.. 13 మంది జాతీయ అవార్డు గ్రహీతలతో కలిసి పని చేశానని చెప్పింది.
కానీ ఈరోజు తనకు పని లేదని చెప్పుకొచ్చింది. ఓ వ్యాపారవేత్త అయితే నెలకు రూ.25 లక్షలు ఇస్తాను.. నా భార్యగా ఉండు అంటూ ఆఫర్ ఇచ్చాడని తెలిపింది. సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఏం చేయాలి..? చనిపోవాలా? సుశాంత్ సింగ్ రాజ్పుత్ తీసుకున్న నిర్ణయమే తీసుకోవాలా? పలు సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!