సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా తెరకెక్కిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘తెలుసు కదా’. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ చిత్రంతో డైరెక్టర్ గా మారారు. తమన్ సంగీతంలో రూపొందిన ‘మల్లిక గంధ’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యింది. సినిమాకి కొంత పబ్లిసిటీ తీసుకొచ్చింది. టీజర్, ట్రైలర్ ఓకే అనిపించాయి.. కానీ సినిమాకి బజ్ తీసుకురాలేదు.
కేవలం సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్, మౌత్ టాక్ పై ఆధారపడి అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సినిమా. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ పై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ వివరాలు ఒకసారి గమనిస్తే :
నైజాం | 7.5 cr |
సీడెడ్ | 2.5 cr |
ఆంధ్ర(టోటల్) | 5 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 15 cr (షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.2 cr |
ఓవర్సీస్ | 3.3 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 19.5 కోట్లు(షేర్) |
‘తెలుసు కదా’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.19.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.20 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సిద్దు గత చిత్రం ‘జాక్’ ఫలితంతో సంబంధం లేకుండా ‘తెలుసు కదా’ కి ఈ రేంజ్ బిజినెస్ జరగడం గ్రేట్ అనే చెప్పాలి. అయితే బ్రేక్ ఈవెన్ కావాలంటే.. పాజిటివ్ టాక్ వస్తేనే సాధ్యమవుతుంది. లేదు అంటే ఆడియన్స్ కి ఇంకో 3 సినిమాలు ఆప్షన్ గా ఉన్నాయి.