Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?
- April 7, 2026 / 01:25 PM ISTByPhani Kumar
దాదాపు 2 దశాబ్దాల నుండి స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది చెన్నై ముద్దుగుమ్మ త్రిష(Trisha Krishnan). తమిళం, తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె.. సెకండ్ ఇన్నింగ్స్లోనూ అదరగొడుతోంది.
Trisha Krishnan
ఏకంగా స్టార్ హీరోలకే టఫ్ ఫైట్ ఇస్తూ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే రేంజ్లో త్రిష క్రేజ్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మధ్య త్రిష పర్సనల్ లైఫ్కు సంబంధించి ఎక్కువ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత అయినటువంటి దళపతి విజయ్తో త్రిషకు ఎఫైర్ ఉందంటూ కొన్నాళ్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరోపక్క విజయ్ భార్య సంగీత విడాకులకు అప్లై చేయడం జరిగింది. ఒక పొలిటీషియన్ అయితే త్రిష.. విజయ్ కి అఫైర్ ఉందని తెలిపాడు. సరిగ్గా ఇలాంటి టైమ్లో ఓ ఈవెంట్లో విజయ్, త్రిష ఇద్దరూ జంటగా కనిపించడంతో ఈ గాసిప్స్కు మరింత బలం చేకూరినట్లయ్యింది.ఈ వివాదాల మధ్య ఇప్పుడు కోలీవుడ్లో మరో సెన్సేషనల్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
త్రిష త్వరలోనే యాక్టింగ్కు పూర్తిగా గుడ్బై చెప్పబోతోందనేది ఆ వార్త సారాంశం. ఈ విషయాన్ని స్వయంగా కొంతమంది టాప్ ప్రొడ్యూసర్లే చర్చించుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీనికి బలం చేకూర్చేలా.. త్రిష ఇటీవల కొత్తగా ఏ ప్రాజెక్ట్కు సైన్ చేయలేదు, పైగా చర్చల దశలో ఉన్న రెండు సినిమాలను కూడా హోల్డ్లో పెట్టిందట.సినిమాలకు గుడ్బై చెప్పి పోలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోందనే మరో స్ట్రాంగ్ బజ్ కూడా నడుస్తోంది.
తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. విజయ్ పార్టీ టీవీకే తరపున ఆమె కీలకంగా మారబోతోందని సమాచారం. విజయ్ పార్టీ పెర్ఫార్మెన్స్ను బట్టి ఆమె పొలిటికల్ కెరీర్ డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉందట.ప్రస్తుతానికైతే.. త్రిష, సూర్య కాంబోలో ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేసిన ‘కరుప్పు’ సినిమా షూటింగ్ పూర్తయింది. మే 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ కూడా రిలీజ్కు రెడీగా ఉంది.
మాజీ ‘మిస్ ఇండియా ఎర్త్’ అదృశ్యం… ఏమైందంటే?














