కోవిడ్ బారిన పడ్డ మరో మెగాహీరో!
- December 29, 2020 / 04:35 PM ISTByFilmy Focus
కరోనా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అందరూ కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఏదొక విధంగా కరోనా ఎటాక్ చేస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. కొందరు కోలుకొని ఆరోగ్యంతో ఇంటికి చేరుకోగా.. మరికొందరు మృత్యువాత పడ్డారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో నాగబాబు కరోనా బారిన పడి తేరుకున్నారు.
చిరంజీవికి కూడా పాజిటివ్ వచ్చిందన్నారు కానీ కిట్ ఫెయిల్ అవ్వడం వలన తప్పుడు రిపోర్ట్ వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. ఈరోజు ఉదయాన్నే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తనకు కోవిడ్ పాజిటివ్ అని చెప్పి షాక్ ఇచ్చారు. మెగాహీరోలందరూ కలిసి ఇటీవల క్రిస్మస్ వేడుకులు జరుపుకున్నారు. దీంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. దానికి తగ్గట్లే మరో మెగా హీరో వరుణ్ తేజ్ తను కూడా కరోనా బారిన పడినట్లు వెల్లడించారు.

సోషల్ మీడియా ద్వారా ఆయన ఈ విషయాన్ని బయట పెట్టారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందనీ.. లక్షణాలు మైల్డ్ గా ఉన్నాయని చెప్పారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రస్తుతం క్వారెంటైన్ లో ఉన్నానని త్వరలోనే కోలుకుంటానని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు క్రిస్మస్ పార్టీ ఫోటోలను షేర్ చేస్తూ.. మెగా హీరోలందరినీ కోవిడ్ టెస్ట్ లు చేసుకోమని సలహాలు ఇస్తున్నారు.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
















