Vijay Devarakonda: మరోసారి సీనియర్ హీరోయిన్ పై ఆసక్తి చూపుతున్న విజయ్ దేవరకొండ?
June 13, 2023 / 01:40 PM IST
|Follow Us
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఈయన లైగర్ సినిమా ప్రభావం నుంచి బయటపడుతూ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు..ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ సమంతతో కలిసి ఈయన ఖుషి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణంలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
విజయ్ దేవరకొండకు (Vijay Devarakonda) గీతగోవిందం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో మరోసారి ఈయన నటించబోతున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుంది. ఖుషి సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.
ఇలా విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా కోసం మరోసారి సీనియర్ హీరోయిన్ అయినటువంటి పూజా హెగ్డేని సెలెక్ట్ చేసినట్టు సమాచారం. పూజా హెగ్డే విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా జనగణమన సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా కొన్ని కారణాలవల్ల ఆగిపోయిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా కోసం తిరిగి పూజ హెగ్డేనే హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం సమంతతో నటిస్తున్నటువంటి ఈయన తన తదుపరి చిత్రానికి కూడా మరొక సీనియర్ హీరోయిన్ ఎంపిక చేయడంతో ఈయన సీనియర్ హీరోయిన్లతో నటించడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలబడునుంది. ఇక ఖుషి సినిమా సెప్టెంబర్ 1వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.