Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?
- August 26, 2026 / 05:55 PM ISTByFilmy Focus Desk
ఒకప్పుడు భారీ చిత్రాల దర్శకుడు శంకర్తో సినిమా చేశాక.. ఆ హీరో నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తారు? అనే ప్రశ్న ఎక్కువగా వినిపించేది. దానికి కారణం ఆయనతో సినిమా చేశాక ఆ హీరోకు ఓ లెవల్ సెట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏ సినిమా చేసినా రాజమౌళితో చేసిన సినిమాను మించి ఉండాలి అనే మాట ఉండటమే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ‘సాహో’ చేస్తే ఆ ఊపు సరిపోలేదు ప్రేక్షకులకు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఇటు ఎన్టీఆర్, అటు రామ్చరణ్ ఆ స్థాయి సినిమాలు చేయలేకపోయారు. దీంతో ఇబ్బందిపడ్డారు.
Maheshbabu
ఇప్పుడు ఇదే పరిస్థితి మహేష్బాబుకు వచ్చింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్న మహేష్.. ఆ తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో అనిల్ రావిపూడి పేరు చర్చలోకి వచ్చింది. అంత పెద్ద సినిమా చేశాక కాస్త రిలీఫ్ ఉండేలా వినోదాత్మక చిత్రం చేయాలని అనుకుంటున్నారని ఆ వార్తల సారాంశం. కానీ ‘తామేం కలసి సినిమా చేయడం లేదని అనిల్ రావిపూడి చెప్పేశారు. సో ఈ కథ క్లియర్.

కానీ మహేష్ నెక్స్ట్ ఆలోచనేంటి అనే విషయంలో క్లారిటీ లేదు. ఇప్పటికే వినిపిస్తున్న సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తాడని. అందుకే రీసెంట్గా బర్త్ డే విషెస్ డిఫరెంట్గా వచ్చాయి కూడా. కానీ అదంత ఈజీనా అనేది చూడాలి. ఎందుకంటే సందీప్ పాత్రలు చాలా వైల్డ్గా ఉంటాయి. మరి మహేష్ అలాంటి పాత్రలు చేస్తారా? అలాగే సందీప్ ఎప్పటికి ఖాళీ అవుతారు అనేది కూడా ప్రశ్న.
ఇవన్నీ తేలాలంటే మార్చి చివరి వారం రావాల్సిందే. ఏప్రిల్ 7న ‘వారణాసి’ సినిమాను రిలీజ్ చేస్తాం అంటున్నారు కాబట్టి మార్చి ఆఖరున ప్రచారంలో విదేశీ మీడియాకో లేక పక్క రాష్ట్రం మీడియాకో మహేష్ బాబు, రాజమౌళి అండ్ కో. ఇంటర్వ్యూలు ఇస్తారు. అప్పుడు ఈ విషయం కూడా తేలొచ్చు. అదేంటి తెలుగు మీడియాకు ఇవ్వరా అంటే.. రాజమౌళి సినిమాలకు తెలుగు మీడియాకు నేరుగా ఇంటర్వ్యూలు ఇచ్చిన సంద్భాలు ఏమున్నాయా అనేది ఆలోచించాలి. పెద్ద దర్శకుడు అయిన తర్వాత.. ఆయన ఈ ఫీట్లు చేయలేదుగా.















