‘వకీల్ సాబ్’ (Vakeel Saab) తర్వాత దర్శకుడు శ్రీరామ్ వేణు (Sriram Venu) కెరీర్లో దాదాపు 4 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఈ నాలుగేళ్లు కూడా ఆయన ‘తమ్ముడు’ (Thammudu) అనే ఒక్క సినిమాకే తన పూర్తి సమయం కేటాయించారు. శ్రీరామ్ వేణుకి గ్యాప్ కొత్తేమీ కాదు. 2012లో అతని మొదటి సినిమా ‘ఓ మై ఫ్రెండ్’ వచ్చింది. తర్వాత 2017 లో అతని 2వ సినిమా ‘ఎం.సి.ఎ’ వచ్చింది.
మళ్ళీ 2021 లో ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) వచ్చింది. ఇప్పుడు అంటే 2025 లో ‘తమ్ముడు’ రాబోతోంది. నిన్న ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వరుస ప్లాపుల్లో ఉన్న నితిన్ (Nithiin) ని సక్సెస్ ట్రాక్ ఎక్కించే విధంగానే ఈ ట్రైలర్ ఉంది అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. మరోపక్క ఈ సినిమాపై నితిన్ కూడా ఎక్కువ హోప్స్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.
ఎందుకంటే.. ఈ సినిమాకి నితిన్ (Nithiin) పారితోషికం తీసుకోకుండా పనిచేశాడు. అడ్వాన్స్ మినహా అతను తీసుకుంది అంటూ ఏమీ లేదు. సినిమా రిలీజ్ అయ్యాక హిట్ అయ్యి లాభాలు వస్తే.. అందులో వాటా తీసుకుంటాడట నితిన్. ఇది మంచి నిర్ణయమే. కానీ ఇది నితిన్ కావాలని తీసుకున్న నిర్ణయం కాదు.
ఎందుకంటే ‘తమ్ముడు’ కి రూ.70 కోట్లు బడ్జెట్ అయ్యింది. నితిన్ కెరీర్లో ఇది హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమా. కథ డిమాండ్ చేయడం వల్లే.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దిల్ రాజు (Dil Raju) ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. అలాగే నితిన్ (Nithiin) నెక్స్ట్ సినిమా ‘ఎల్లమ్మ’ ని కూడా దిల్ రాజే (Dil Raju) నిర్మిస్తున్నారు.