రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) .. కన్నడ బ్యూటీ అయినప్పటికీ తక్కువ టైంలోనే ఈమె పేరు తెలుగు రాష్ట్రాల్లో కూడా మార్మోగింది. కన్నడలోనే కాకుండా తమిళంలో కూడా చాలా సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. అయితే ‘సప్త సాగరాలు దాటి- సైడ్ ఎ’ (Sapta Sagaralu Dhaati) సినిమాలో ఈమె లుక్స్, ఎక్స్ప్రెషన్స్ తెలుగు యువతని కట్టి పడేశాయి. ఆ సినిమా బాక్సాఫీస్ ఫలితం సంగతి ఎలా ఉన్నా… ఈమెకి మాత్రం అది హెల్ప్ అయ్యింది అనే చెప్పాలి.
అంతకు ముందు నిఖిల్ (Nikhil) హీరోగా సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo) సినిమాలో కూడా ఈమె నటించింది. కానీ ఆ సినిమా లేట్ గా రిలీజ్ అవ్వడం వల్ల రుక్మిణీకి పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదు. తర్వాత ‘స్పిరిట్’ లో దాదాపు ఈమె మెయిన్ హీరోయిన్ గా ఫిక్స్ అన్నారు. ఆ అవకాశం కొద్దిలో మిస్ చేసుకుంది ఈ అమ్మడు. అయినా సరే ఈమెకు తెలుగులో మంచి ఆఫర్లే ఉన్నట్టు స్పష్టమవుతుంది.
ప్రస్తుతం ఈమె ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ లో హీరోయిన్ గా నటిస్తుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరోపక్క త్రివిక్రమ్ (Trivikram) సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా ఎంపికైనట్టు టాక్ వినిపిస్తుంది. అవును ప్రస్తుతం వెంకటేష్ (Venkatesh ) హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది ఈ అమ్మడు.
ఇందులో మరో హీరో కూడా నటించే అవకాశాలు ఉన్నాయి. ఆ హీరోకి జోడీగా రుక్మిణి నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి ‘హారిక హాసిని..’ కాంపౌండ్లో సినిమా చేస్తే.. ఆ తర్వాత ‘సితార..’ బ్యానర్లో కూడా కంటిన్యూగా నటించే అవకాశాలు ఈమెకు ఉన్నాయి.