South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్
- May 4, 2026 / 08:43 PM ISTByPhani Kumar
సౌత్లో పాలిటిక్స్ ను గమనిస్తే సినిమా రంగంతో మంచి అనుబంధం ఉందేమో అనిపిస్తుంది. వెండితెరపై అలరించిన స్టార్ హీరోలు(South Heroes) బాక్సాఫీస్ ను కొల్లగొట్టడం,జనహృదయాలను గెలుచుకోవడం మాత్రమే కాదు … అదే ఊపులో రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టి సంచలనం సృస్తించిన సందర్భాలు మనం చాలా చూశాం.
South Heroes
అయితే అలా అడుగుపెట్టిన వాళ్ళంతా విజయం సాధించారా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. కానీ వాళ్ళ ఇంపాక్ట్ అయితే చాలా పడింది. ఎంజీఆర్, సీనియర్ ఎన్టీఆర్ నుండి చూసుకుంటే.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఇప్పుడు విజయ్ వంటి వారు రాజకీయ రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినవారే.

అయితే మొదటిసారి ఎన్నికల బరిలో నిలబడినప్పుడు వీరి ‘స్టార్ పవర్’ ఎంత వరకు ఓట్ బ్యాంక్ గా కన్వర్ట్ అయ్యింది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రండి :
ఎన్టీఆర్ : తెలుగు నాట రాజకీయ చరిత్రను తిరగరాసిన ఘనత కచ్చితంగా నందమూరి తారక రామారావు గారి సొంతం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 1983లో ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ మొదటి ఎన్నికల్లోనే ఏకంగా 46.30% ఓట్ల పర్సెంటేజీని సాధించి సంచలనం సృష్టించింది. ఒక నటుడు రాజకీయాల్లోకి వచ్చి అంతటి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం అప్పట్లో ఓ సెన్సేషన్.
ఎంజీఆర్ : తమిళనాడు రాజకీయాల్లో ఎం.జి.రామచంద్రన్ లిఖించిన చరిత్ర మాటల్లో చెప్పలేనిది. 1977లో ఆయన తన మొదటి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు ఏకంగా 33.52% ఓట్ల పర్సెంటేజీని సాధించారు. సినిమా ఛరిష్మాను రాజకీయ శక్తిగా మలచుకోవడంలో ఆయన వేసిన పునాదులే ఇప్పటికీ అక్కడ రాజకీయాలను శాసిస్తున్నాయి అని చెప్పాలి.
చిరంజీవి : ‘సేవే లక్ష్యం ప్రేమే మార్గం’ అంటూ మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ 16.32% ఓట్ల పర్సెంటీజీని స్థాపించింది. రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నప్పటికీ, మూడవ శక్తిగా ఈ స్థాయి ఓట్లు సాధించడం చిన్న విషయం అయితే కాదు. అయితే ఏడాదికే ప్రజారాజ్యం పార్టీని చిరు కాంగ్రెస్లో విలీనం చేసేసి చాలా నెగిటివిటీని మూటగట్టుకున్నారు.
పవన్ కళ్యాణ్ : ‘జనసేనాని’ పవన్ కళ్యాణ్ 2014 లో జనసేన పార్టీని స్థాపించారు. అయితే ఆయన ఎన్నికల బరిలో నిలిచింది మాత్రం 2019 లోనే.! అయితే పవన్ పార్టీ ధారుణపరాజయం పాలైంది. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ 5.53% ఓట్ల పర్సెంటేజీని పొందింది. 2024 ఎన్నికల సంగతి తెలిసిందే కదా. 21 స్థానాల్లో పోటీ చేసి అన్ని చోట్లా విజయం సాధించారు జనసేనాని.
విజయ్ : ప్రస్తుతం అందరి కళ్ళు తమిళ సూపర్ స్టార్ విజయ్ పైనే ఉన్నాయి. తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీని స్థాపించి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆయన నిలిచారు.వందకి పైగా స్థానాల్లో విజయం సాధించి తమిళ నాట చరిత్ర సృస్థించారు విజయ్. ఓటింగ్ పర్సెంటేజీ 50 శాతం పైనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఎపిక్ రికార్డ్ అనే చెప్పాలి.
పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్















