అట్లీ దర్శకత్వంలో కార్తీ..?
- May 27, 2016 / 01:09 PM ISTByFilmy Focus
రాజా రాణి, పోలీసోడు వంటి చిత్రాలను తెరకెక్కించిన అట్లీ.. కార్తి హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం కథా పరమైన చర్చలు జరుగుతున్నాయని, ఎజీయస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మించే ఉందని అంటున్నారు.
మరోవైపు పోలీసోడు చిత్ర ప్రమోషన్స్ సమయంలో మహేష్ ను కలిసిన అట్లీ.. మహేష్ కు ఓ కథ చెప్పాడట. అయితే బ్రహ్మోత్సవం విడుదల తరువాత తన నిర్ణయం చెబుతానని చెప్పిన మహేష్.. ఇప్పుడు అట్లీ కి నో చెప్పాడని దాంతో అట్లీ కార్తి తో కలిసి చిత్రాన్ని చేస్తున్నట్లు ఫిలిం నగర్ భోగట్టా.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















