శివ కార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘మదరాసి’. ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుధ్ సంగీతంలో రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. పైగా దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ కూడా వరుస ప్లాపుల్లో ఉండటం వల్ల ‘మదరాసి’ పై పెద్దగా బజ్ లేదు. కానీ శివ కార్తికేయన్ ఉన్న సూపర్ ఫామ్ కారణంగా ఈ సినిమాకి బిజినెస్ బాగా జరిగింది.
ముఖ్యంగా గత ఏడాది వచ్చిన ‘అమరన్’ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ‘మదరాసి’ కి తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ చాలా బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 3.2 cr |
సీడెడ్ | 1.5 cr |
ఉత్తరాంధ్ర | 1.5 cr |
ఈస్ట్+వెస్ట్ | 0.80 cr |
కృష్ణా + గుంటూరు | 2.0 cr |
నెల్లూరు | 0.50 cr |
ఏపి+ తెలంగాణ(టోటల్) | 9.5 cr |
‘మదరాసి’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.9.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ‘అమరన్’ సినిమాకి ఆల్మోస్ట్ రెండింతలు బిజినెస్ చేసింది ‘మదరాసి’. ఆ సినిమా తెలుగులో ఫుల్ రన్ ముగిసేసరికి రూ.26 కోట్ల పైనే షేర్ ను రాబట్టింది. సో ‘మదరాసి’ కి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. వసూళ్లు భారీగానే వస్తాయి. అయితే పాజిటివ్ టాక్ వస్తేనే.. ! లేదు అంటే ఆడియన్స్ కి ‘ఘాటి’ రూపంలో ఇంకో ఆప్షన్ ఉంది