‘ఫ్యామిలీ మ్యాన్ 2’(The Family Man 2) తో వెబ్ సిరీస్ల్లోకి వచ్చిన ప్రముఖ కథానాయిక సమంత (Samantha) ఆ తర్వాత వరుస వెబ్సిరీస్లు ఓకే చేస్తూ వచ్చింది. మొన్నీమధ్య ‘సిటడెల్’ సిరీస్ చేసింది. ఆ సిరీస్ ఫలితం అటు ఇటుగా వచ్చింది అంటున్నారు. ఈ కారణమో ఇంకేదైనా కారణం ఉందో కానీ ఆమె నెక్స్ట్ వెబ్ సిరీస్ ‘రక్త్ బ్రహ్మాండ్’ గురించి గత కొన్ని రోజులుగా ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. రీసెంట్గా మరోసారి ఈ సిరీస్ ఆగిపోయింది అనే పుకార్లు వచ్చాయి. తాజాగా దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
ఆదిత్య రాయ్ కపూర్, సమంత (Samantha) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘రక్త్ బ్రహ్మాండ్’ (Rakt Brahmand). రాజ్, డీకే, అనిల్ బార్వే రూపొందిస్తున్న సిరీస్ ఇది. అయితే గత కొన్ని రోజులుగా సిరీస్ అప్డేట్ లేకపోవడంతో సిరీస్ ఆగిపోయింది అనే వార్తలొచ్చాయి. కొంతమంది బడ్జెట్ సమస్యలు అంటే, మరికొందరు క్రియేటివ్ డిఫరెన్స్ అని అన్నారు. ఇంకొందరు ఇప్పట్లో పరిస్థితులు అనుకూలించేలా లేవు అని అంటున్నారు. అయితే టీమ్ మాత్రం షెడ్యూల్ ప్రకారమే చిత్రీకరణ జరుగుతోందని చెబుతోంది.
వరుస షెడ్యూల్స్తో ‘రక్త్ బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్ను ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నాం. ఇండోర్ టాకీ షెడ్యూల్ పూర్తయిందని టీమ్ చెప్పుకొచ్చింది. ఇక అవుట్డోర్ షెడ్యూల్ ఒకటి ప్లాన్ చేశామని, అందులో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తామని కూడా చెప్పారు. అయితే ఆ షెడ్యూల్కి తగ్గ వాతావరణం కోసం ఎదురుచూస్తున్నామని అంటున్నారు. ఆ సీన్స్ని వర్షాలు పడే రోజుల్లో చిత్రీకరించాలని, అలాగే చుట్టూ పచ్చదనం కూడా అవసరమని, అందుకే కొన్ని రోజులు ఆగి కొత్త షెడ్యూల్ను ప్రారంభిస్తామని టీమ్ చెప్పింది.
అంటే సిరీస్ షూటింగ్ అయితే ఆగిపోయింది. వాతావరణ అంతా అనుకూలించాక షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అదెప్పుడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అన్నట్లు ఈ వెబ్ సిరీస్ ఆగిపోయిందంటూ వార్తలు రావడం ఇదేం తొలిసారి కాదు. ఫిబ్రవరిలో ఇలాంటి వార్తలే వచ్చాయి. సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రూ.3 కోట్లు దొంగిలించారని, దీంతో నెట్ఫ్లిక్స్ (స్ట్రీమింగ్ హక్కులు వారి దగ్గరే ఉన్నాయి) విచారణకు ఆదేశించిందని వార్తలొచ్చాయి. అలా మూడోసారో, నాలుగోసారో సిరీస్ ఆగలేదని క్లారిటీ ఇచ్చారు.