మంచు విష్ణు (Manchu Vishnu) ఆఫీసులపై ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టు ప్రచారం మొదలైంది. ‘కన్నప్ప’ (Kannappa) సినిమా కోసం మంచు విష్ణు భారీగా ఖర్చు పెట్టాడు. బడ్జెట్ వంద కోట్లు పైనే అయినట్టు కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ లెక్కలు చెబితే ఐటీ అధికారులు మా ఆఫీస్ లో సోదాలు నిర్వహించేందుకు వస్తారని కూడా చమత్కరించాడు.
మరోపక్క బ్రహ్మాజీ (Brahmaji) షేర్ చేసిన ఓ వీడియోలో మోహన్ బాబు (Mohan Babu) ‘7000 ఎకరాలు న్యూజిల్యాండ్ లో మంచు విష్ణు కొనుగోలు చేసినట్టు’ చెప్పుకొచ్చాడు. తర్వాత అది సరదాగా చేసిన వీడియో అని బ్రహ్మాజీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఐటీ వాళ్ళు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారేమో అని కొందరు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. మంచు విష్ణు టీం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ‘అవి ఐటీ అధికారులు చేసిన దాడులు కాదని, జీఎస్టీ అధికారులు వచ్చి అకౌంట్స్ చెక్ చేసి కొన్ని వివరాలు తీసుకున్నారని’ చెప్పుకొచ్చారు. మరోపక్క విష్ణు ‘కన్నప్ప’ (Kannappa) స్పెషల్ షో కోసం ప్రసాద్ ల్యాబ్ కు వెళ్లడం కూడా జరిగింది.
మరోపక్క జూన్ 27న ‘కన్నప్ప’ (Kannappa) రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం మంచు విష్ణు తన శక్తికి మించి కష్టపడ్డాడు. ప్రమోషన్స్ భారం అంతా తానే మోశాడు. అన్ని రాష్ట్రాల్లోనూ ‘కన్నప్ప’ (Kannappa) ని గ్రాండ్ గా ప్రమోట్ చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas), అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ కూడా నటించిన సంగతి తెలిసిందే.