‘ది రాజాసాబ్’ (The RajaSaab) టీజర్ నిన్న అంటే జూన్ 16న రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం యూట్యూబ్లో అది తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాపై ఉన్న నెగిటివిటీని ఈ టీజర్ రూపుమాపిన సంగతి తెలిసిందే. ప్రభాస్ (Prabhas) లుక్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ ఈ టీజర్ కి హైలెట్ గా నిలిచాయి అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి కూడా ఆకట్టుకునే విధంగా డిజైన్ చేశారు.
సో రిలీజ్ డిలే అవ్వడం ‘వర్త్ వెయిటింగ్’ అని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. అందుకే డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక టీజర్ ను ఇప్పటికే యూట్యూబ్లో కోటి మందికి పైగా చూసినట్టు అంకెలు ఉన్నాయి. వాళ్లలో ఓ 20 లక్షలు రిపీట్స్ లో ఉన్నా ఈజీగా 80 లక్షల మంది చూసి ఉండొచ్చు అనేది అంచనా. ఇది కేవలం తెలుగు వెర్షన్ టీజర్ లెక్కలు మాత్రమే.
హిందీ టీజర్ ను మరో కోటి మంది, తమిళ టీజర్ ను 20 లక్షల మంది, కన్నడ టీజర్ ను మరో 20 లక్షల మంది, మలయాళం టీజర్ ను మరో 20 లక్షల మంది వీక్షించినట్టు యూట్యూబ్ లెక్కలు చెబుతున్నాయి. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. టీజర్లో ఒక షాట్ ఉంది. చాలా మంది దీనిని గమనించి ఉండకపోవచ్చు అనే చెప్పాలి. అందులో హీరోయిన్లు, కమెడియన్లు ఒక చోట నిలబడి పైకి చూస్తూ ఉంటారు.
కట్ చేస్తే.. ఆ పైనే మరికొంతమంది జనాలు ‘రాజాసాబ్’ (The RajaSaab) ప్రభాస్ (Prabhas) ని ఆవహించిన సంజయ్ దత్ (Sanjay Dutt) ఆత్మ పై ఎటాక్ చేయడం.. వంటివి మనం గమనించవచ్చు. టీజర్ రిలీజ్ రోజు ముందు ఓ ప్రీ టీజర్ ని వదిలారు. అందులో హీరోయిన్లు అయినా రిద్ధి కుమార్ (Riddhi Kumar), మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిథి అగర్వాల్ (Nidhhi Agerwal)..లు షాకయ్యి పైకి చూస్తున్నట్టు ఉంటుంది. అది ఎందుకు అనేది టీజర్లో చెప్పకనే చెప్పారు. సో దీన్ని బట్టి దర్శకుడు మారుతి (Maruthi) గట్టిగానే ప్లాన్ చేసినట్లు అనుకోవచ్చు.