నానితో మల్టీ స్టారర్ మూవీకి ఒకే చెప్పిన తారక్
- December 1, 2016 / 07:00 AM ISTByFilmy Focus
యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరో అయినప్పటికీ కథ నచ్చితే ఎవరితోనైనా నటించడానికి సిద్ధమని పలు మార్లు మీడియాకు చెప్పారు. చెప్పినట్లుగానే మల్టీ స్టారర్ మూవీ చేసేందుకు తాజాగా తారక్ ఒకే చెప్పినట్లు తెలిసింది. జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత మూడు నెలలుగా కథలు వింటున్న ఎన్టీఆర్ కి ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రాలను తెరకెక్కించిన యువ డైరక్టర్ హను రాఘవపూడి చెప్పిన కథ కొత్తగా అనిపించిందట. ఎన్టీఆర్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆ స్టోరీ రాయడంతో సూపర్ గా నచ్చిందని సమాచారం. అయితే ఇందులో మరో హీరో కూడా నటించాల్సి ఉంది. ఆ పాత్రకు ఎవరు సూట్ అవుతారని చర్చకు రాగానే నేచురల్ స్టార్ నాని పేరుని డైరక్టర్ సూచించారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.
నానితో కలిసి నటించడానికి తనకి ఎంతో సంతోషమని ఎన్టీఆర్ చెప్పారని వెల్లడించాయి. తారక్ మరో మాట కూడా చెప్పారంట.. తనని, తన ఇమేజ్ ని అసలు మైండ్ లో పెట్టుకోవద్దని కథకు కావాల్సినట్టుగానే క్యారక్టరైజేషన్ ఉండాలని స్పష్టం చేసారంట. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ రాసే పనిలో హను రాఘవపూడి బిజీ అయ్యారు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలను ఎన్టీఆర్ తన స్టార్ డమ్ ని పక్కన పెట్టి చేశారు. అదే ఫార్ములాని తర్వాతి చిత్రాలకు అప్లై చేస్తున్నారు. రొటీన్ కథలకు బై బై చెప్పి వినూత్న కథలతో విజయాల్ని అందుకుంటున్నారు. సో ఈ మల్టీ స్టారర్ మూవీ కూడా హిట్టేనన్నమాట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















