ఖైదీ నంబర్ 150 మూవీలో కోతకు గురైన పృధ్వి సీన్లు
- January 4, 2017 / 12:33 PM ISTByFilmy Focus
ఖడ్గం మూవీలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో పాపులర్ అయిన పృధ్వి ఈ మధ్య అనేక సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 లో నటించే అవకాశం అందుకున్నారు. కానీ చిరుతో స్క్రీన్ పంచుకున్న ఆనందం అతనికి ఎక్కువకాలం నిలవలేదు. పృధ్వి నటించిన సీన్లన్నీ కోతకు గురైనట్లు తెలిసింది. ఈ విషయాన్నీ ఆయనే చాలా బాధపడుతూ ఈరోజు అభిమానులతో పంచుకున్నారు. “మెగాస్టార్ గారి 150 వ సినిమాలో నటించడం నా అదృష్టం. సీన్స్ తీసెయ్యడం నా దురదృష్టం. సంక్రాంతి రోజున మా అమ్మ చచ్చిపోయినంత బాధగా ఉంది” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సినిమాను 150 నిముషాలకు కుదించాలనే కొన్ని సీన్లు కట్ జేసినట్లు చిత్ర బృందం స్పష్టం చేసినప్పటికీ, ఈ కోతలో పృధ్వి సీన్లు మాత్రమే బలికావడంపై బ్రహ్మానందం హస్తం ఉందని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. తన అవకాశాలన్నీ లాక్కొని పోతున్నాడని ఎప్పటినుంచో కోపంగా ఉన్న బ్రహ్మానందం ఇప్పుడు పృధ్వి పై పగ తీర్చుకున్నారని వివరించారు. మెగాస్టార్ కి చెప్పి సినిమాలో పూర్తిగా పృధ్వి లేకుండా చేసారని వెల్లడించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















