పూరి పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు!
- April 18, 2016 / 07:34 AM ISTByFilmy Focus
తెలుగు ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన పూరి జగన్నాథ్ ను కొందరు వేదిస్తున్నారట. అసలు విషయానికొస్తే ‘లోఫర్’ టైమ్లో నష్టపోయిన పంపిణీదారులు ఇప్పుడు పూరి జగన్నాథ్ వెంటపడ్డారట. ‘నీ వల్లే నష్టపోయాం. నువ్వే సమాధానం చెప్పాలి’ అంటూ వేధిస్తున్నారట. ‘నీ తరవాత సినిమా మాకే ఇవ్వాలి’ అంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారట.
దాంతో.. పూరి ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. కొంతమంది బయ్యర్లు తనని మానసికంగా వేధిస్తున్నారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. పూరి పిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ప్రాధమిక విచారణ చేపట్టారు. మరి ఆ బయ్యర్లు ఎవరో, పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకొంటారో చూడాలి.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















