Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?
- March 25, 2026 / 08:20 AM ISTByPhani Kumar
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో పడింది. పూరీ గత చిత్రాలు ‘లైగర్’ ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను విజయ్ సేతుపతితో ఒక సినిమా చేస్తున్నాడు.
Puri Jagannadh
అయితే ‘లైగర్’ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాల ఫలితాలు పూరీని ఇప్పటికీ వెంటాడుతున్నాయి. వేధిస్తున్నాయి అని చెప్పాలి. ఈ 2 సినిమాలను కొనుగోలు చేసిన బయ్యర్లు, ఎగ్జిబిటర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నారు.

‘లైగర్’ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను అయితే కోట్లలో నష్టపోయి ఏకంగా డిస్ట్రిబ్యూషన్ మార్కెట్ నుంచే మాయమైపోయారు. ఇక ‘హనుమాన్’ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి ‘డబుల్ ఇస్మార్ట్’ ని భారీ రేటుకి కొనుగోలు చేసి భారీ మూల్యమే చెల్లించుకున్నారు. ఈ నష్టాలకు బాధ్యత వహిస్తూ పూరి జగన్నాథ్ ఆ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ ఇష్యూ ఎప్పుడో ఫిల్మ్ ఛాంబర్ వరకు వెళ్లింది. పూరి నుంచి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు, ఇతర వర్గాలు ఎంతో ఓపికగా వెయిట్ చేస్తున్నాయి.
కానీ, ఈ ఎఫెక్ట్ ఇప్పుడు పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్పై పడబోతోంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా పూరి ‘స్లమ్డాగ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు పూరీ. ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయింది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం కోసం ప్రస్తుతం నాన్-థియేట్రికల్ డీల్స్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు. అయితే, పాత బకాయిలు క్లియర్ చేయకపోతే ‘స్లమ్డాగ్’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం అసాధ్యం. థియేట్రికల్ డీల్స్ కూడా ఇంకా క్లోజ్ కాలేదు.
అసలు పూరితో ఉన్న ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్లే.. మహేష్ బాబు ‘పోకిరి’ రీ-రిలీజ్ కూడా ఆగిపోయిందని టాక్. వాస్తవానికి ‘పోకిరి’ రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు పూర్తికావస్తున్న నేపధ్యంలో.. ఏప్రిల్ 28 న రీ- రిలీజ్ కి ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు అది రీ- రిలీజ్ కావడం లేదు. అందుకు కారణం ఇదే. పూరి తమ బకాయిలు చెల్లించే వరకు ఆయన సినిమాలను బాయ్కాట్ చేయాలని పలువురు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు డిసైడ్ అయ్యారట. మరి ఈ భారీ కష్టాల నుంచి పూరి జగన్నాథ్ ఎలా గట్టెక్కుతారో చూడాలి.














