ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయం సాధించిన “పుష్ప 2” సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ (Allu Arjun) మాట్లాడుతూ టికెట్ హైక్ కి పర్మిషన్ ఇచ్చిన ఆంధ్ర, తెలంగాణా ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు చెబుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోయి, స్టేజ్ కింద నుండి ఎవరో అందిస్తే చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన రచ్చకి ఇదే కారణం అంటూ కేటీఆర్ ఎద్దేవా చేయడంతో లేనిపోని సమస్యలు తలెత్తాయి.
మళ్లీ ఇవాళ (జూన్ 14) గద్దర్ అవార్డ్స్ ఈవెంట్లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్ అవార్డ్ అందుకున్న బాలకృష్ణ.. (Balakrishna) స్టేజ్ మీద పెద్దలకు ధన్యవాదాలు చెబుతూ ఇచ్చిన స్పీచ్ లో, తెలంగాణ డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క పేరు మర్చిపోయారు. చాలాసేపు నీళ్లు నములుకున్న తర్వాత గుర్తుకొచ్చి మళ్లీ థ్యాంక్స్ చెప్పాడు.
దాంతో.. అప్పుడు ముఖ్యమంత్రి పేరు బన్నీ మర్చిపోతేనే అంత రాద్ధాంతం జరిగింది, ఇప్పుడు బాలయ్య (Balakrishna) డిప్యూటీ సీయం పేరు మర్చిపోయారు, మళ్లీ ఏం జరుగుతుందో అనే చర్చ మొదలైంది. అయితే.. బాలయ్య-రేవంత్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే.
ఒకప్పుడు రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తి అనే విషయం అంత త్వరగా మర్చిపోకూడదు. సో, మరీ అంత హడావుడి ఏమీ ఉండదని ఇంకొంతమంది సర్దిచెబుతున్నారు. ఏదేమైనా.. ఈ విషయం మాత్రం ఈవెంట్లో ఒన్నాఫ్ ది హైలైట్ గా నిలిచింది.