వచ్చే ఏడాది త్రివిక్రమ్, చెర్రీ కాంబినేషన్లో సినిమా లేదు
December 23, 2016 / 02:05 PM IST
|Follow Us
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా హీరోలతో నాలుగు చిత్రాలు తీశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జల్సా, అత్తారింటికి దారేది తెరకెక్కించిన ఈ డైరక్టర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో జులాయి, సన్నాఫ్ సత్య మూర్తి చేసి విజయాలను సొంతం చేసుకున్నారు. ఆయన మెగా కాంపౌండ్ లోనే ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ తో ఇప్పటివరకు ఒక చిత్రం కూడా రూపొందించలేదు. అబ్బాయికి కథను రెడీ చేయమని పవన్ గతంలో త్రివిక్రమ్ కి చెప్పారు. అయన కూడా ఒకే అన్నారు. అయినా ఇద్దరి కలయిక ఇప్పట్లో కుదిరేటట్టు లేదు.
ఎందుకంటే మాటల మాంత్రికుడు ప్రస్తుతం పవర్ స్టార్ తో ఓ మూవీ త్వరలో మొదలు పెట్టనున్నారు. ఇది అయిపోయిన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి వెళ్లనున్నారు. వచ్చే ఏడాది అంతా వీరిద్దరి సినిమాలతోనే సరిపోతుంది. ఇక చెర్రీ ఏమైనా ఖాళీగా ఉన్నారంటే అది లేదు. ధృవ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న రామ్ చరణ్ వచ్చే నెల నుంచి సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నారు. దాని తర్వాత మణిరత్నం సినిమా ఒకే అయింది. సో డైరక్టర్, హీరో ఇద్దరూ బిజీ కావడంతో ఇప్పట్లో వీరి సినిమా వచ్చేటట్లు లేదని చిత్ర విశ్లేషకులు చెబుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.