మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) నటిస్తున్న ‘మాస్ జాతర’ (Mass Jathara) షూటింగ్ దశలో ఉంది. ‘సామజవరగమన’ (Samajavaragamana) కి రైటర్ గా పనిచేసిన భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. అతను సూపర్ టాలెంటెడ్ అని ఇండస్ట్రీ మొత్తం చెబుతుంది. ‘మాస్ జాతర’ ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రామిసింగ్ గా ఉంది. కచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని.. భాను భోగవరపు రూపంలో ఇండస్ట్రీకి మరో టాలెంటెడ్ అండ్ కమర్షియల్ దర్శకుడు లభిస్తాడని..
భవిష్యత్తులో ఇతను అనిల్ రావిపూడిలా (Anil Ravipudi) స్టార్ అవుతాడని అంతా చెప్పుకుంటున్నారు.అది ఎంత వరకు నిజమవుతుందో ఆగస్టు 27న తేలిపోతుంది. ఇక ‘మాస్ జాతర’ తర్వాత రవితేజ.. కిషోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారు. ముందుగా ‘ప్రేమలు'(Premalu)బ్యూటీ మమితా బైజు(Mamitha Baiju), ‘డ్రాగన్’ (Return of the Dragon) బ్యూటీ కయాడు లోహార్(Kayadu Lohar ) .. ఫిక్స్ అన్నారు. కానీ ఆ ఇద్దరు బ్యూటీస్ ఇప్పుడు చాలా బిజీ. వాళ్ళ కాల్షీట్లు దొరకడం కష్టంగా మారింది.
దీంతో మమితా బైజు ప్లేస్లో కేతిక శర్మని (Ketika Sharma) తీసుకున్నారు. మరి కయాడు ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారా? అని అంతా ఆసక్తితో ఎదురుచూశారు. మొత్తానికి ఆమె ప్లేస్ లో ఆషిక రంగనాథ్(Ashika Ranganath)..ను తీసుకున్నట్లు తెలుస్తుంది. ‘నా సామి రంగ’ (Naa Saami Ranga) తర్వాత ఆషిక (Ashika Ranganath) తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ‘విశ్వంభర’ (Vishwambhara) లో ఆమె నటించింది. కానీ ఆమె పాత్ర సినిమాలో ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టింది ఈ బ్యూటీ. ఇది ఆమెకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.