‘కుబేర’ (Kuberaa) సినిమా గత శుక్రవారం రిలీజ్ అయ్యింది. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna) ప్రధాన పాత్రలు పోషించారు. రష్మిక (Rashmika Mandanna) కీలక పాత్ర పోషించింది. హీరో, హీరోయిన్ అనేలా కాదు.. అందరివీ కథని ముందుకు తీసుకెళ్లే పాత్రలే. చెప్పాలంటే నాగార్జున, ధనుష్, రష్మిక.. ముగ్గురూ పెద్ద స్టార్స్. కానీ వాళ్ళు దర్శకుడు శేఖర్ కమ్ములకి పూర్తిగా సరెండర్ అయ్యారు.
సీనియర్ స్టార్ హీరోలకి ‘ఇంకా సోలో హీరో సినిమాలేంటి.. కొత్తగా ప్రయత్నించాలి’ అనే మెసేజ్ పాస్ చేశాడు నాగ్. స్టార్ డం కి సరెండర్ అవ్వకుండా నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలని చాటి చెప్పాడు ధనుష్ (Dhanush). ఇక రష్మిక కూడా ఇప్పటి స్టార్ హీరోయిన్లందరికీ మాదిరిగా నిలిచింది.
స్టార్ హీరోయిన్లు ఇంకా గ్లామర్ ని, స్టార్ హీరోలని, పారితోషికాలనే నమ్ముకుంటే ముందు వెళ్తారు అనేది అపోహ అని రష్మిక ప్రూవ్ చేసింది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ కాదు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు కథని ముందుకు తీసుకెళ్లే ఓ కీలక పాత్ర. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఓ చెత్త వ్యాన్ ఎక్కి.. అందులో చెత్త ప్యాకెట్లతో తనను తాను కప్పుకోవాలి. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లు ఇలాంటి సీన్స్ లో నటిస్తారా? రష్మిక (Rashmika Mandanna) చేసింది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా సీన్లు ఉన్నాయి. ‘ఈ ప్రపంచంలో అందరూ అడుక్కునేవాళ్లే’ అంటూ ఆమె చెప్పిన ఓ డైలాగ్ ఓ పక్క నవ్వు తెప్పించినా చాలా ఆలోచింపజేసేలా సహజంగా ఉంది. కొన్ని సన్నివేశాల్లో ‘క్షణ క్షణం’ తో శ్రీదేవి (Sridevi) ని గుర్తుచేసింది. అందుకే నిన్న ‘కుబేర’ (Kuberaa) లో నాగార్జున కూడా రష్మికని చూస్తుంటే శ్రీదేవి (Sridevi) గుర్తొస్తుంది అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు.
రష్మికను చూస్తే.. క్షణక్షణంలో శ్రీదేవిగారు గుర్తొచ్చారు
ఇప్పుడు నేషనల్ క్రష్ కాదు.. నా క్రష్ కూడా#Kuberaa #SekharKammula #Dhanush #NagarjunaAkkineni #RashmikaMandanna #Chiranjeevi #DeviSriPrasad pic.twitter.com/umLxhmmgay
— Filmy Focus (@FilmyFocus) June 22, 2025