ఒకప్పుడు తెలుగు సినిమాకు రేట్లు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ‘ఉ అంటే’ పర్మిషన్ ఇచ్చేసిది. ఆ తర్వాత పర్మినెంట్ జీవో ఇచ్చి పెంచేసుకోండి అని చెప్పేశారు. ఆ సమయంలో రేట్లు పెంపు కాదు కదా.. తక్కువ రేటుకు టికెట్లు అమ్మేవారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. ఇప్పుడు మొత్తంగా పరిస్థితి మారింది. కొత్త సినిమా వస్తోంది అంటే టికెట్ రేట్ల పెంపు జీవో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నుండి వస్తోంది. అలా ‘కుబేర’ (Kuberaa) సినిమాకుగాను చిత్రబృందం ఏపీ ప్రభుత్వం నుండి టికెట్ రేటు పెంపు అవకాశం పొందింది.
థియేటర్ తారతమయ్యం లేకుండా గరిష్ఠంగా రూ.75 పెంచుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కుబేర’ (Kuberaa) టీమ్కు ఛాన్స్ ఇచ్చింది. అయితే తాము పర్మిషన్ వచ్చాక కూడా రేట్లు పెంచలేదు అని చెబుతున్నారు సినిమా నిర్మాత సునీల్ నారంగ్ (Suniel Narang). టికెట్ ధరలు మేము భారీగా పెంచలేదు. ఆంధ్రపద్రేశ్లో మరీ తక్కువ ధరలు ఉన్నాయనే కాస్త పెంచాము. థియేటర్లు, ప్రాంతాలకు తగ్గట్టుగా ఒక్కో టికెట్పై రూ.25 నుండి రూ.50 పెంచాం. అంతేకానీ అంతకుమించి పెంచలేదు అని నిర్మాత చెప్పారు.
టికెట్ రేటు విషయంలో అంత కష్టపడి పర్మిషన్లు తెచ్చుకుని కూడా ఎందుకు అంత పెంచలేదు అనేదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే తెలంగాణలో టికెట్ రేట్లు పెంచే పరిస్థితి లేదు. పెంచిన దగ్గర మొత్తం తీసుకోవడం లేదు. నిర్మాత ఆలోచనేంటో ఆయనకే తెలియాలి. అయితే ఆయన మాటల్లో మనకు వినిపించిన మరో మాట.. ఏపీలో టికెట్ రేట్లు తక్కువ అని. మరి ఇన్నేళ్లుగా ఎవరూ ఈ మాట అనలేదు ఎందుకో?
ఇక ఇదే సమయంలో నిర్మాత సునీల్ నారంగ్ (Suniel Narang)మాటల్లో మరో ఆసక్తికరమైన మాటలు వినిపించాయి. ఈ సినిమా సమయంలో పని విషయంలోనే ఒత్తిడికి గురయ్యా. సెన్సార్ విషయంలో టెన్షన్ పడ్డానని చెప్పారు. అయితే దానికి మించి వేరే టెన్షన్ ఏమీ లేదు అని చెప్పారు. తాను సాధారణంగా టెన్షన్ ఇస్తానని కానీ ఈసారి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఈ సమయంలో నాగార్జున (Nagarjuna) సాయం చేశారని సునీల్ నారంగ్ (Suniel Narang) తెలిపారు. అంతేకాదు ఆయన వల్లే సినిమా అనుకున్న సమయానికి విడుదల చేయగలిగాం అని తెలిపారు.